మహానందిని వీడని పాములు.. భయాందోళనలో భక్తులు
వర్షాకాలం కావడంతో పాములు కొండలు, కోనలు వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పర్వతప్రాంతాలకు సమీపంలో ఉండటం వలన పాములు పుణ్యక్షేత్రాల్లోకి చొరబడుతున్నాయి. తిరుమలలో నడక మార్గంలో, దుకాణాల్లో పాములు, కొండచిలువలు తిష్టవేసి భక్తులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో పాములు హల్చల్ చేస్తున్నాయి.
సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తుల క్యూ లైన్వద్ద నాగుపాము కనిపించి భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పుడు మహానందిలోని పోలీస్ క్వార్టర్స్లో కొండచిలువ హల్చల్ చేసింది. సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిని పాములు వీడటం లేదు. సోమవారం భక్తుల క్యూ లైన్ లలో నాగుపాము హల్చల్ చేయగా మంగళవారం మహానంది పోలీస్ క్వార్టర్స్ లో కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో మహానందివాసులు పాముల బెడదతో ఆందోళనకు గురవుతున్నారు. పోలీస్ క్వాటర్స్ లో కొండచిలువను గమనించిన పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురైయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు.రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ మోహన్ ఎంతో చాకచక్యంగా ఐదు అడుగుల కొండచిలువను పట్టుకొని సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టారు. కొండచిలువ పట్టుబడటంతో పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గురక ప్రాణాంతకమా.. నిపుణుల హెచ్చరిక
Gold Price: బాబోయ్ బంగారం ధర మోత మోగిపోతోంది..
రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ పక్షి జాడ కనిపెట్టారు..!
గుడ్డిగా కెరీర్ ఎంపిక. అంకుల్ సలహానే వేదం 90% స్టూడెంట్స్ దుస్థితి ఇదీ
గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

