తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే ??

|

Oct 14, 2024 | 8:20 PM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సంజీవన్‌రావుపేటలో కలుషిత నీరు కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందగా.. 30మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. మిషన్‌ భగీరథ నీరు సరఫరా ఆగిపోవడంతో కొద్దిరోజులుగా గ్రామంలోని రెండు కాలనీల ప్రజలు ఓ బావి నీటిని వినియోగించారు. దాంతో.. తీవ్ర అనాగోగ్యం పాలయ్యారు. అస్వస్థతకు గురైనవారిని సంగారెడ్డిలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సంజీవన్‌రావుపేటలో కలుషిత నీరు కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందగా.. 30మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. మిషన్‌ భగీరథ నీరు సరఫరా ఆగిపోవడంతో కొద్దిరోజులుగా గ్రామంలోని రెండు కాలనీల ప్రజలు ఓ బావి నీటిని వినియోగించారు. దాంతో.. తీవ్ర అనాగోగ్యం పాలయ్యారు. అస్వస్థతకు గురైనవారిని సంగారెడ్డిలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఇంటికి ఒకరిద్దరు చొప్పున అస్వస్థతకు గురవ్వడంతో 50మందికి పైగా అనారోగ్యం పాలై ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఊళ్లో ఉన్న బావి నీరు తాగడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. మంచినీటి ట్యాంక్ దగ్గర అపరిశుభ్రంగా ఉందని, లీకేజీ సమస్య ఉందని చెప్పినా.. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స‌ల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హ‌త్య‌కు దారి తీసిందా ??

ఇక్కడ ఆటో సర్వీస్‌ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..

బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు.. అద్దాల బీరువాల్లో వారు వాడిన కత్తులు

గర్ల్‌ఫ్రెండ్‌ను లాంగ్‌ డ్రైవ్‌‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా మావ ??

యోగాసనాలతో నవదుర్గ రూపాలు

Follow us on