మార్కెట్లోకి మరొ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 K.M’s నుండి 130 K.M’s రైడ్.. వీడియో
క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో ప్లస్ స్కూటీని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. గంటకు 70 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల
క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో ప్లస్ స్కూటీని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. గంటకు 70 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని తెలిపింది క్రేయాన్ సంస్థ. ఈ నెలఖారులోగా రెండు కొత్త హై-స్పీడ్ మోడళ్లు మార్కెట్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర.. 64వేలరూపాయలుగా ఉంది. కొత్త స్నోప్లస్ స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్కు ఓల్డ్ వర్షన్ స్కూటర్ లుక్ను తీసుకొచ్చింది క్రేయాన్ మోటర్స్. ప్రకాశవంతమైన రంగులు, గుండ్రని హెడ్ల్యాంప్లు, రౌండ్ రియర్-వ్యూ మిర్రర్స్ని అమర్చారు. దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది 250-వాట్ BLDC మోటారుతో వస్తుంది. స్కూటర్కు ట్యూబ్లెస్ టైర్లు, డిస్క్ బ్రేక్లు కూడా ఉన్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

