AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌లోకి మరొ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 K.M's నుండి 130 K.M's రైడ్.. వీడియో

మార్కెట్‌లోకి మరొ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 K.M’s నుండి 130 K.M’s రైడ్.. వీడియో

Anil kumar poka
|

Updated on: Feb 21, 2022 | 2:01 PM

Share

క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో ప్లస్‌ స్కూటీని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే.. గంటకు 70 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల


క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో ప్లస్‌ స్కూటీని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే.. గంటకు 70 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని తెలిపింది క్రేయాన్‌ సంస్థ. ఈ నెలఖారులోగా రెండు కొత్త హై-స్పీడ్ మోడళ్లు మార్కెట్‌లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర.. 64వేలరూపాయలుగా ఉంది. కొత్త స్నోప్లస్‌ స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఓల్డ్‌ వర్షన్‌ స్కూటర్‌ లుక్‌ను తీసుకొచ్చింది క్రేయాన్‌ మోటర్స్‌. ప్రకాశవంతమైన రంగులు, గుండ్రని హెడ్‌ల్యాంప్‌లు, రౌండ్ రియర్-వ్యూ మిర్రర్స్‌ని అమర్చారు. దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది 250-వాట్ BLDC మోటారుతో వస్తుంది. స్కూటర్‌కు ట్యూబ్‌లెస్ టైర్లు, డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

మరిన్ని చూడండి ఇక్కడ: