ఎయిర్ షోలో కుప్పకూలిన యుద్ధ విమానం !!

Updated on: Nov 22, 2025 | 10:46 AM

దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్ షోలో భారత్ తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ప్రదర్శన జరుగుతుండగా అల్ మక్తూమ్ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీగా నల్లటి పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. ఇది తేజస్ విమానం రెండవ ప్రమాదం, ఈ ఘటన ఏవియేషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

దుబాయ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్‌ షోలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన జరుగుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దట్టమైన నల్లటి పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. పైలట్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడా..? లేదా..? అన్నది స్పష్టంగా తెలియలేదు. కానీ, ప్రమాద తీవ్రతను చూస్తుంటే పైలట్‌ బతికే ఛాన్స్‌ లేదనే తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కూడా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందూస్తాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌ తయారు చేసింది. తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. తొలిసారిగా 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూలిపోయింది. అయితే, ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయ్యారు. తేజస్ చరిత్రలో అదే మొదటి ప్రమాదం. తేజస్ 4.5వ తరం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇందులో పైలట్ సురక్షితంగా బయటపడేందుకు ‘జీరో-జీరో’ ఎజెక్షన్ సీటు వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీకి మరో తుఫాన్ గండంమరో 4 రోజుల్లో భారీ వర్షాలు