Eluru: వేసిన తాళం వేసినట్టే ఉంది.. తీరా ఉదయాన్నే షట్టర్ తెరిచి చూడగా..
మద్యం అమ్మకాలతో ఆ షాపునకు దండిగా డబ్బులు వచ్చిపడ్డాయ్. ఎంచక్కా నెక్స్ట్ రోజు ఆ డబ్బులు లెక్కపెట్టాలని అనుకున్నారు. మరుసటి రోజు షట్టర్ కి వేసిన తాళం తెరిచి చూడగా.. దెబ్బకు ఎదురుగా కనిపించిన సీన్ చూసి కళ్లు తేలేశారు యజమానులు. ఇంతకీ అసలేం జరిగిందంటే
ఇదేంటో.! ఈ మధ్యకాలంలో దొంగలకు బ్రాందీ షాపులే టార్గెట్గా మారాయి. ఊరు చివరన ఉన్న పలు బ్రాందీ షాపులపై పడి దొరికినకాడికి దొరికినంత దోచేస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో ఏలూరు జిల్లా ద్వారకతిరుమలలోని ఓ బ్రాందీ షాపులో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న శ్రీనివాస బ్రాందీ షాపులో దొంగలు పడి.. లక్ష రూపాయల నగదు, మూడు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. రాడ్ల సాయంతో ఆ షాపు షట్టర్ తెరవడం.. పైకప్పు మీదున్న రేకులు కొయ్యకుండా.. చాలా జాగ్రత్తగా షాపు షెడ్పై ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు దొంగలు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను పగలగొట్టి.. రికార్డయిన ఫుటేజ్ను ఎత్తుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

