Eluru: వేసిన తాళం వేసినట్టే ఉంది.. తీరా ఉదయాన్నే షట్టర్ తెరిచి చూడగా..
మద్యం అమ్మకాలతో ఆ షాపునకు దండిగా డబ్బులు వచ్చిపడ్డాయ్. ఎంచక్కా నెక్స్ట్ రోజు ఆ డబ్బులు లెక్కపెట్టాలని అనుకున్నారు. మరుసటి రోజు షట్టర్ కి వేసిన తాళం తెరిచి చూడగా.. దెబ్బకు ఎదురుగా కనిపించిన సీన్ చూసి కళ్లు తేలేశారు యజమానులు. ఇంతకీ అసలేం జరిగిందంటే
ఇదేంటో.! ఈ మధ్యకాలంలో దొంగలకు బ్రాందీ షాపులే టార్గెట్గా మారాయి. ఊరు చివరన ఉన్న పలు బ్రాందీ షాపులపై పడి దొరికినకాడికి దొరికినంత దోచేస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో ఏలూరు జిల్లా ద్వారకతిరుమలలోని ఓ బ్రాందీ షాపులో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న శ్రీనివాస బ్రాందీ షాపులో దొంగలు పడి.. లక్ష రూపాయల నగదు, మూడు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. రాడ్ల సాయంతో ఆ షాపు షట్టర్ తెరవడం.. పైకప్పు మీదున్న రేకులు కొయ్యకుండా.. చాలా జాగ్రత్తగా షాపు షెడ్పై ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు దొంగలు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను పగలగొట్టి.. రికార్డయిన ఫుటేజ్ను ఎత్తుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

