AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

Pvv Satyanarayana

| Edited By: Ravi Kiran

Updated on: Jan 25, 2025 | 8:20 PM

కలెక్టర్ గారు స్వయంగానే షాపు షాపుకు తిరిగి కూరగాయలు కొనడం అక్కడ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆమె చిటికేస్తే ఇంటి వద్దకే కూరగాయలు తెచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఒక గృహిణిగా మారి ఇంట్లోకి కావలసిన వెజిటేబుల్స్ ఆమెనే కొనడం అందరిని ఆకట్టుకుంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతు బజార్లో ప్రతీ షాపూ తిరుగుతూ నచ్చిన కూరగాయలు కొనుక్కున్నారు. అమలాపురంలో రైతు బజార్ ను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, హార్టికల్చర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాయింట్ కలెక్టర్ నిషాంతి రైతులు ఏర్పాటుచేసిన కూరగాయల స్టాల్స్ వద్దకు వెళ్లి స్వయంగా కూరగాయలను కొనుక్కున్నారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా షాపు షాప్ కు వెళ్లి తనకు నచ్చిన ఆకుకూరలు, బెండకాయలు, బీరకాయలు, టమాటాలతో పాటు పలు రకాల కూరగాయలు స్వయంగా కొనుక్కోవడంతో రైతులు హ్యాపీగా ఫీలయ్యారు. జాయింట్ కలెక్టరే స్వయంగానే షాపు షాపూ తిరిగి కూరగాయలు కొనడం చూసి.. అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Jan 25, 2025 08:19 PM