Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: వెయ్యి మందితో యుద్ధం.. దద్దరిల్లే ఇంటర్వెల్‌కు నీల్ శ్రీకారం

TOP 9 ET News: వెయ్యి మందితో యుద్ధం.. దద్దరిల్లే ఇంటర్వెల్‌కు నీల్ శ్రీకారం

Phani CH

|

Updated on: Jun 11, 2025 | 5:01 PM

రామ్‌చరణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు ఇటీవల జోరందుకున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధం నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతలో త్రివిక్రమ్‌ - వెంకటేష్‌ మూవీ కంప్లీట్‌ అవుతుందన్నది టాక్‌. ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. భారీ టెంపుల్‌ సెట్‌లో 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఈ సీన్‌ను తెరకెక్కిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. వార్‌2లో ఎన్టీఆర్‌ పోషిస్తున్న పాత్రలో చాలా కోణాలుంటాయి. అందుకే ఆయన పాత్ర కోసం చాలా లుక్స్ డిజైన్‌ చేయాల్సి వచ్చిందన్నారు ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అనైతా ష్రాఫ్‌ అడజానియా. తారక్‌లో ఏదో ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుందని, సెట్‌ మొత్తం ఆ వైబ్‌ ఫీలవుతుందని చెప్పారు. ఆగస్టు 14న విడుదల కానుంది వార్‌2. మణిరత్నం సినిమా వల్ల శింబుకు డ్యామేజ్ జరుగుతుందనే టాక్ కోలీవుడ్‌లో ఉంది. అయినా మళ్లీ అదే పని చేస్తున్నారు ఈహీరో. ఎస్ ! థగ్‌ లైఫ్ నిరాశపరిచినా.. మరోసారి మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట శింబు. అయితే ఈయన నిర్ణయం ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌ పెదవి విరిచేలా చేస్తోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. వెట్రిమారన్‌తోనూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు శింబు. ఇది వన్‌ ఆఫ్ ది కోలీవుడ్‌ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌! మినీ బస్సు సైజులో మొసలిని చూశారా

ఒక్క ఫోటోతో.. సోషల్ మీడియాను ఫిదా చేసిన రష్మిక

అడ్డంగా బుక్కైన మంగ్లీ.. బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్ మత్తు!

వీడు మామూలోడు కాదు.. ఎదురుపడిన కోబ్రాను ఏం చేసాడంటే

లోయర్ బెర్త్‌లో ఆ పని చేసిన వృద్ధ దంపతులు