లోయర్ బెర్త్లో ఆ పని చేసిన వృద్ధ దంపతులు
రైలు నడుస్తోంది... లోయర్ బెర్త్లో ఓ వృద్ధ జంట ఎదురెదురుగా కూర్చొన్నారు. భర్త ఆ పని చేస్తుంటే తలదించుకొని చూస్తోంది భార్య. వైరల్ అవుతున్న వీడియోలో ఏం జరిగిందంటే.. చాలా మంది రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కొత్త వ్యక్తులు తారసపడటం, వాళ్లతో పరిచయాలు పెరిగి, పిచ్చాపాటి మాట్లాడుకోవడం చూస్తాం. కొంతమంది తమ భాగస్వామితో సన్నిహితంగా గడపడానికి ఇష్టపడతారు.
కదులుతున్న రైలుకు సంబంధించిన అలాంటి ఓ ఘటన ఇటీవల సోషల్ మీడియా వైరల్ అయింది. వీడియోలో ఒక వృద్ధ జంట రైలులో కలిసి ప్రయాణిస్తున్నారు. కింది బెర్త్లో ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. ఆ వృద్ధ మహిళ ముందు కూర్చున్న వ్యక్తి ఆమె భర్త అని తెలుస్తోంది. అతను తల వంచుకుని ఏదో చేస్తున్నాడు. అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ వీడియోలో, భర్త ప్రేమగా తన భార్య గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తున్నాడు. ప్రేమను వ్యక్తపరచడానికి అంత కంటె మంచి ఉదాహరణ లేదని, ఆనందపు క్షణాలను సృష్టించుకోవడంలో ఉందని నిరూపించారు. వృద్ధుడు తన భార్య గోళ్లకు ఎర్రటి నెయిల్ పాలిష్ను ఓపికగా వేస్తుండగా అతని భార్య నవ్వుతూ చూస్తోంది. వృద్దాప్యంలో భార్యభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలకు ఈ ఘటన అద్దం పడుతోందని కామెంట్స్ రూపంలో నెటిజన్లు పోస్ట్లు పెట్టారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.3 కోట్లకు మంది పైగా చూడగా 9 లక్షల మంది లైక్ చేశారు. ఈ చిన్న వీడియో నెటిజన్ల హృదయాల్లో పెద్ద స్థానాన్నే సంపాదించుకుంది. ఇది విధేయతకు మంచి ఉదాహరణ అనీ నేటి కాలంలో ఇలాంటి ప్రేమ దొరకడం చాలా అరుదు, నిజమైన ప్రేమ కాలంతో పాటు ఎప్పుడూ తగ్గదు, బదులుగా మరింత సాన్నిహిత్యాన్ని , మాధుర్యాన్ని జోడిస్తుందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్ డి.. అధ్యయనాల్లో వెల్లడి
TOP 9 ET News: గూస్ బంప్స్ కాదు.. పిచ్చెక్కిస్తోన్న.. అఖండ2 యాక్షన్
బాబుది సింపుల్ టీషర్ట్ అనుకునేరు.. కొనాలంటే మన నెల జీతం కూడా సరిపోదు
నేను చేసిన ఎదవ పనికి.. పాపం.. NTR గుక్కపెట్టి ఏడ్చాడు!
ఒకప్పుడు వైజాగ్లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
