హనుమాన్‌ టీం నుంచి గుడ్ న్యూస్.. ఇక తెలంగాణలో బీభత్సమే

|

Jan 16, 2024 | 7:13 PM

హనుమాన్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా కథ, కథనాలు అబ్బుర పరిచే విజువల్స్‌, నటుల ప్రతిభ.. ఇలా అన్ని అంశాల్లోనూ హనుమాన్‌ అదుర్స్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళుతోంది. అయితే రిలీజ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్‌ సినిమాకు పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి.

హనుమాన్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా కథ, కథనాలు అబ్బుర పరిచే విజువల్స్‌, నటుల ప్రతిభ.. ఇలా అన్ని అంశాల్లోనూ హనుమాన్‌ అదుర్స్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళుతోంది. అయితే రిలీజ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్‌ సినిమాకు పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. సంక్రాంతి బరిలో మహేశ్‌, వెంకటేశ్‌, నాగార్జున సినిమాలు ఉండడంతో హనుమాన్‌ సినిమాను చూద్దామనుకున్న అబిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రియులకు హనుమాన్‌ చిత్ర బృందం ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సినిమాకు భారీ రెస్పాన్స్‌ వస్తోన్న కారణంగా జనవరి 15 నుంచి హనుమాన్‌ మూవీకి అదనపు మార్నింగ్‌ షోలను కలుపుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఇది కేవలం తెలంగాణకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు షోస్‌ లపై ఎలాంటి అప్డేట్స్‌ లేవు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prasanth Varma: ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ అది వాళ్లను ఉద్దేశించేనా ??

Guntur Kaaram: గుంటూరు టీం సీరియస్ విషయం పోలీసుల వరకు ??

Devara: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న దేవర

Saindhav: సైంధవ్‌పై నెగెటివ్‌ రివ్యూలు.. డైరెక్టర్ ఎమోషనల్ మెసేజ్

Hanuman: హనుమాన్‌కు బిగ్ పంచ్ అక్కడ టాకే లేదు..

Follow us on