Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: స్వామీజీ చెబితే.. బ్లాక్‌ బస్టరే..! స్వామి దయానంద గురూజీపై రజినీకాంత్.

Rajinikanth: స్వామీజీ చెబితే.. బ్లాక్‌ బస్టరే..! స్వామి దయానంద గురూజీపై రజినీకాంత్.

Anil kumar poka

|

Updated on: Aug 16, 2023 | 3:37 PM

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తరచుగా హిమాలయాలను సందర్శిస్తుంటారు. సినిమా విడుదలైతే తప్పకుండా ఇక్కడకు వెళ్తుంటారు. మనశ్శాంతి కోసం హిమాలయాలను సందర్శిస్తారని చాలా మందికి తెలుసు. కాగా కోవిడ్ కారణంగా గత నాలుగేళ్లుగా రజినీ హిమాలయాలకు వెళ్లలేకపోయారు. జైలర్ సినిమా విడుదల సందర్భంగా రిషికేశ్‌ను సందర్శించారు. తాజాగా బద్రీనాథ్ ఆలయానికి వెళ్లారు.

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తరచుగా హిమాలయాలను సందర్శిస్తుంటారు. సినిమా విడుదలైతే తప్పకుండా ఇక్కడకు వెళ్తుంటారు. మనశ్శాంతి కోసం హిమాలయాలను సందర్శిస్తారని చాలా మందికి తెలుసు. కాగా కోవిడ్ కారణంగా గత నాలుగేళ్లుగా రజినీ హిమాలయాలకు వెళ్లలేకపోయారు. జైలర్ సినిమా విడుదల సందర్భంగా రిషికేశ్‌ను సందర్శించారు. తాజాగా బద్రీనాథ్ ఆలయానికి వెళ్లారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. మరోవైపు రిషికేశ్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని రజనీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అంచనాల మధ్య జైలర్ విడుదలైంది. కంగారుపడొద్దు, సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది అని స్వామీజీ చెప్పారని, ఆయనే స్వయంగా ఆ మాట చెప్పారంటే జైలర్ హిట్ అయినట్టే అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్‌‌ దర్శకత్వంలో రూపొందించిన జైలర్ మూవీ ఆగస్టు 10న విడుదలై హిట్ టాక్ అందుకుంది. మూడు రోజుల్లోనే 200 కోట్ల వసూళ్లు సాధించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...