పూరి-రామ్ కాంబో డబుల్ ఇస్మార్ట్ షురూ.. హీరోయిన్ ఎవరంటే ??
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతగానో మెప్పించి బ్లాక్ బస్టర్గా నిలించింది. ఈ చిత్రం సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ను కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే.
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతగానో మెప్పించి బ్లాక్ బస్టర్గా నిలించింది. ఈ చిత్రం సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ను కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఇస్మార్ట్ అప్డేట్ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. లైగర్ రిజల్ట్ తనను తీవ్రంగా బాధించినా మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి. జులై 10న ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగినట్లు యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ను కూడా ముందుగానే ప్రకటించింది. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ ‘స్కంద’ చేస్తున్నాడు. ఇది సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ కిక్ ఇవ్వడమే కాకుండా.. లైగర్తో నష్టపోయిన పూరి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం ఖాయం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీరంలో షార్క్ చక్కర్లు.. భయంతో జనం పరుగులు..
అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే ??
పువ్వుల్లో బాహుబలి !! దగ్గరకెళ్తే మీరు బలి !!
Digital TOP 9 NEWS: ఢిల్లీలో వరద బీభత్సం | హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం
అమ్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదవ ఫ్లోర్ పై నుంచి దూకిన చిన్నారి