శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?
పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఈ బాలుడు కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ.. హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కిమ్స్ వైద్యులు.
శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఆక్సిజన్ తీసుకున్నట్టు చెప్పారు కిమ్స్ వైద్యులు. అలాగే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రక్రియ ద్వారా శ్రీతేజ పొట్టలోకి ఆహారం పంపిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ఇప్పటికీ కుటుంబసభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నాడని.. అతడి శరీర కదలికల కోసం ఫిజియోథెరపీ కూడా చేస్తున్నామని వైద్యులు హెల్త్ బులెటిన్తో తెలిపారు. అయితే ఓ నెల క్రితం శ్రీతేజను కిమ్స్కెళ్లి పరామర్శించిన బన్నీ వాసు… ఆ బాలుడికి మెరగైన వైద్యం అందించాలని డాక్టర్స్ను కోరాడు. అవసరం అయితే ఫారెన్కు తీసుకెళ్లడానికి వెనకాడను అన్నట్టు మీడియాతో చెప్పారు. ఈ క్రమంలోనే శ్రీతేజ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతున్న డాక్టర్లు చెప్పడం… ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!
పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే
చావా సినిమా ఎఫెక్ట్ బంగారం కోసం ఆ కోట చుట్టూ తవ్వకాలు
ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్ డెలివరీ .. అరుదైన ఘటన
చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ
దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు..
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

