రజనీ – కమల్ మల్టీస్టారర్ ఏమైంది.. తెలుసుకోండి
రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా వాయిదా పడింది. ఇద్దరు అగ్రనటులు ప్రస్తుతం యాక్షన్ చిత్రాలు చేస్తున్నందున, వారి కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా యాక్షన్ కావడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపారు. అభిమానులు నిరాశ చెందినప్పటికీ, భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ సాకారం కావచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
కూలీ సినిమా విడుదల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతోందన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలింనగర్లో రోజూ వార్తలు చక్కర్లు కొట్టాయి. జైలర్ 2 తర్వాత రజినీ ఓ మల్టీస్టారర్లో నటిస్తారన్న వార్తలతో అభిమానులు సంతోషించారు. కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే రజినీ-కమల్ మల్టీస్టారర్ ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. లోకేష్ గతంలో రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేశారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్కు హఠాత్తుగా బ్రేక్ పడింది. మల్టీస్టారర్ను పక్కన పెట్టి, సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్ బ్యానర్లో రజినీకాంత్ హీరోగా మరో సినిమా ప్రకటించారు. దీంతో రజినీ-కమల్లను ఒకే ఫ్రేమ్లో చూడాలనుకున్న అభిమానులు డీలా పడిపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: హైప్ పెంచుతున్న తారక్ టీమ్.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా
హిట్టు కొట్టు.. కార్ పట్టు..! దర్శకులకు లగ్జరీ కార్ల బహుమతులు ఇవే
Spirit: స్పిరిట్లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

