క్రేజీ అప్డేట్! బుర్జ్ ఖలీఫాపై.. పవన్ కల్యాణ్ “హరిహర” ట్రైలర్ రిలీజ్
పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు ట్రైలర్ను కాస్త డిఫరెంట్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్ ప్రతిష్ఠాత్మక బుర్జ్ ఖలీఫా బిల్డింగ్పై ట్రైలర్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ కావడం విశేషం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- జ్యోతికృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'హరిహర వీరమల్లు'.
ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ జానర్లో రెండు భాగాలుగా రూపొందుతోంది. రీసెంట్గా మేకర్స్ తొలి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్- 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. తాజాగా సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం మూవీటీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసే ప్లాన్లో ఉన్నారు. గ్లోబల్ లెవెల్లో సినిమాకు బజ్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల టాలీవుడ్ చరిత్రలో దుబాయ్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్పై తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. ప్రచారం సాగుతున్నట్లు హరిహరి వీరమల్లు ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై విడుదల చేస్తే, అక్కడ రిలీజైన తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డ్ సృష్టించనుంది. ఇదివరుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమా ట్రైలర్ను బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AI ఆస్పత్రి.. రోబోలే డాక్టర్లు, నర్సులు.. ఎక్కడంటే ??
గాల్లో విమానం.. పైలట్ లేకుండా ప్రయాణం..
మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి ఇలా
వామ్మో.. పెద్దపులి వచ్చింది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
