అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!
గతేడాది దీపావళికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియా స్వామి ఈ బయోపిక్ ను తెరకెక్కించారు. ఆర్మీ మేజర్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ గా సాయి పల్లవి ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించింది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించాడు.
దేశ భక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ ఆడియెన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ఈ సినిమా…! అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఈ సినిమా ఛాన్స్ ఫస్ట్ మన టాలీవుడ్ హీరోకే వచ్చిందట. ఎస్ ! అమరన్ సినిమాలో కథానాయకుడిగా ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ను అనుకున్నారట. దర్శకుడు రాజ్ కుమార్ పెరియా స్వామి అల్లు అర్జున్తోనే ఈ మూవీ చేయాలని భావించారట. కానీ అల్లు అర్జున్ అప్పటికే తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. కనీసం అపాయిట్మెంట్ దొరకడం కూడా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియా స్వామికి కష్టమైందట. దీంతో మరో ఛాయిస్ లేక ఈ సినిమా కోసం హీరో శివ కార్తీకేయన్ ను అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ పెరియా స్వామి. ఇక ఆ తర్వాత బన్నీ పుష్ప 2లో బిజీ కావడంతో నేరుగా శివకార్తికేయన్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారట. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. శివ కార్తికేయన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా హిస్టరీకెక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ బోర్ అనుకున్నా కానీ.. వామ్మో..! రాజాసాబ్పై మాళవిక నాటీ కామెంట్స్
కారు ముక్కలైనా సేఫ్గా బయటపడ్డ నలుగురు
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!

