బెట్టింగ్ ఎఫెక్ట్! యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్
నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ పైగా తాను గొప్ప పని చేస్తున్నానంటూ సమర్థించుకున్న యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ఈ యూట్యూబ్ ర్ పై కేసు నమోదు చేశాడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఇక ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అంతేకాదు తాను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదంటూ చెప్పారు సజ్జనార్. బెట్టింగ్ యాప్లను ప్రొత్సహిస్తూ.. పబ్బం గడుపుకొంటోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో మాత్రమే తాను పోరాడుతున్నానంటూ చెప్పారు సజ్జనార్. అంతేకాదు తమను అనుసరిస్తోన్న లక్షలాది మందిని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు తప్పుదారి పట్టిస్తున్నారు. అమాయాకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుందని.. దేశ భవిష్యత్ ను అగమ్య గోచరంలో పడేస్తుందన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?