రష్మిక బాలీవుడ్‌ సినిమాపై రాజుకున్న వివాదం

రష్మిక బాలీవుడ్‌ సినిమాపై రాజుకున్న వివాదం

Samatha J

|

Updated on: Jan 28, 2025 | 2:01 PM

విక్కీ కౌశల్‌, రష్మికా మందన్న నటించిన "చావా" అనే హిందీ సినిమా చుట్టూ వివాదం రాజుకుంది. ఛత్రపతి శివాజీ కుమారుడైన శంభాషీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్‌ నటిస్తున్నారు. ఆయన భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమాపై వివాదం ముదురుతోంది.

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. సినిమాలో శంభాజీ మహరాజ్‌ డ్యాన్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహరాజు డాన్స్‌ చేసినట్లు చూపిస్తే, ఆయన్ను అవమానించడమేనని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ డాన్స్‌ దృశ్యాలు తొలగంచాలని మహారాష్ట్ర మంత్రి ఉదయ్‌ సామంత్‌ డిమాండ్‌ చేశారు.సినిమా చూశాకే విడుదలకు అనుమతి ఇస్తామనీ, లేకపోతే పర్మిషన్‌ ఇచ్చేది లేదని మంత్రి సామంత్‌ ఖరాకండీగా చెప్పారు.