ఇండిగో ఎయిర్లైన్స్పై శ్రుతిహాసన్ ఫైర్.. ఏం జరిగిందంటే ??
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్పై ప్రముఖ నటి శృతిహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యం కావడమే. దాంతో ఇండిగోపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయననీ, కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమానయాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్పై ప్రముఖ నటి శృతిహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యం కావడమే. దాంతో ఇండిగోపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయననీ, కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమానయాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు పలువురు ప్రయాణికులు ఎయిర్పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంటల పాటు ఉండిపోయామని శృతిహాసన్ తెలిపారు. ఎయిర్లైన్స్ సిబ్బంది విమానం ఆలస్యం విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమానయాన సంస్థ తన సర్వీసులను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. ఇక శ్రుతిహాసన్ ట్వీట్పై ఇండిగో ఎయిర్లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

