Soaked Peanuts: నానబెట్టిన వేరుశెనగ ఉదయాన్నే తింటే.. సూపర్ బెనిఫిట్స్.

Updated on: Feb 16, 2024 | 4:17 PM

వేరుశనగను సామాన్యుడి జీడిపప్పు అంటారు. వేరుశనగలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, కాపర్‌, ఐరన్‌, సెలీనియం, జింక్‌, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వేరుశనగను సామాన్యుడి జీడిపప్పు అంటారు. వేరుశనగలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, కాపర్‌, ఐరన్‌, సెలీనియం, జింక్‌, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వేరుశెనగలో రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండటం వల్ల హృదయనాళ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ గింజలను నీటిలో నానబెట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నానబెట్టిన వేరుశెనగలను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. నానబెట్టిన వేరుశెనగలను రోజూ ఉదయం తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న వేరుశెనగలను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎముకలు బలపడతాయి. నట్స్‌లో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా, అనేక అంటు వ్యాధులను నివారించవచ్చు. వేరుశెనగలో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు కంటి చూపును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..