Rahul Gandhi: రాహుల్ గాంధీ వెనకున్న ఫొటో ఎవరు తీసారో తెలుసా..?? ( వీడియో )
కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తాజాగా ఓ వీడియోను రిలీజ్చేశారు.
కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తాజాగా ఓ వీడియోను రిలీజ్చేశారు. ఓ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నరాహుల్ రాబోయే థర్డ్ వేవ్ను ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే వీడియో బాక్గ్రౌండ్లో గోడపై ఉన్న ఓ ఫొటో ట్విట్టర్ నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. ఫ్రేమ్ కట్టిన ఫొటోలో నీలిరంగు ఆకాశం.. ఎవరెస్ట్ శిఖరం అందాలు స్పష్టంగా కనువిందు చేస్తున్నాయి. ఈ ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్న ట్విట్టర్ నెటిజనులకు సమాధానం దొరికేసింది. ఈ ఫోటోను క్లిక్మనిపించింది రైహాన్ రాజీవ్ వాద్రా అని తెలిసింది. 20 ఏళ్ళ రైహాన్ రాజీవ్ వాద్రా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా, రాబర్ట్ వాద్రాల గారాలపట్టి. రైహాన్ స్వతహాగా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. ఇన్స్టాలో రైహాన్ ఫొటోగ్రఫీ పేజ్కి 8 వేల మంది అభిమానులున్నారట. ” ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్.. మౌంట్ ఎవరెస్ట్ ఫ్రం ద స్కై ” అనే కాప్షన్తో ఎవరెస్ట్ శిఖరం ఫొటోను గత ఫిబ్రవరిలో రైహాన్ ఇన్స్టాలో పోస్ట్ చేసారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గుజరాత్లో ఏలియన్స్.! మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి… ( వీడియో )
Sachin Tendulkar: పాట పాడిన సచిన్… త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన క్రికెట్ గాడ్.. ( వీడియో )
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
