Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Updated on: Jan 10, 2026 | 5:56 PM

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్‌రెడ్డి లంచాలు తీసుకున్నట్లు సిట్ విచారణలో అంగీకరించారు. నాణ్యత లేని నెయ్యికి సర్టిఫికెట్లు ఇచ్చి, భోలే బాబా, ప్రీమియర్ కంపెనీల నుండి లక్షలాది రూపాయలు, ఆల్ఫా డెయిరీ నుండి బంగారం లంచంగా తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. టీటీడీకి రూ.118 కోట్ల నష్టం వాటిల్లింది.

తిరుమల లడ్డూలలో వాడే నెయ్యి కల్తీ కేసులో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడకంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీటీడీ డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్‌రెడ్డి సిట్ విచారణలో స్వయంగా సంచలన విషయాలు అంగీకరించడం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. లంచాలకు మరిగి నెయ్యి నాణ్యతను పక్కన పెట్టినట్లు ఆయన ఒప్పుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్

గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్