24 ప్రీమియం ఎకానమీ సీట్లతో.. ఎయిరిండియా సరికొత్త విమానం..

|

Jul 10, 2024 | 7:21 PM

ఎయిర్‌ ఇండియా టాటా గ్రూప్‌ అధీనంలోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విమానాలు ఆధునీకరణ, విమానాల్లో సదుపాయాలు, సీట్లు సహా అన్నింటిలోనూ సరికొత్త విధానాలతో విమాన సేవలను మెరుగుపరుస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎయిర్‌ ఇండియా సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నారోబాడీ విమానాల్లోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు.

ఎయిర్‌ ఇండియా టాటా గ్రూప్‌ అధీనంలోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విమానాలు ఆధునీకరణ, విమానాల్లో సదుపాయాలు, సీట్లు సహా అన్నింటిలోనూ సరికొత్త విధానాలతో విమాన సేవలను మెరుగుపరుస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎయిర్‌ ఇండియా సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నారోబాడీ విమానాల్లోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు. ప్రీమియం ఎకానమీ సీట్లతో కూడిన ఈ విమానం ఎయిర్‌ ఇండియాలో చేరింది. ఈ నారోబాడీ విమానంలో 8 విలాసవంతమైన బిజినెస్‌ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు భిన్నంగా, సరికొత్త లివరీతో ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్‌ తయారీ ప్లాంటు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ విమానం ఆదివారమే చేరింది. దేశీయ మార్గాల్లో ఈ విమానాన్ని ఆగస్టు నుంచి నడపనున్నారు. ఇప్పటికే ఎయిర్‌బస్‌ 320 నియో విమానాలు 3 ఎయిరిండియా దగ్గర ఉన్నా, అవన్నీ పాత డిజైన్‌ ప్రకారం రూపొందించినవే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్‌లో ఘటన

40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు

బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం

కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు

ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్‌ ??

Follow us on