Vijayawada: ‘అమ్మ చదువుకోమంటోంది..’ తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు
విజయవాడలోని ఒక బాలుడు తన తల్లిని చదువుకోమని బలవంతం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి, తన కుమారుడు చదువుకునేలా ప్రోత్సహించడంతో, బాలుడు కోపంతో ఈ పని చేశాడు. ఏసీపీ దుర్గా రావు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. చివరకు, బాలుడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు.
విజయవాడలోని సత్యనారాయణపురం గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఒక బాలుడు తన తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తల్లి తనను చదువుకోమని బలవంతం చేస్తుందని బాలుడు ఆరోపించాడు. తల్లి ఒంటరిగా ఇద్దరు కుమారులను పెంచుకుంటోంది. పెద్ద కుమారుడు పని చేసి చిన్న కుమారుడి చదువుకు ఖర్చులు భరిస్తున్నాడు. చిన్న కుమారుడికి తల్లి సెల్ ఫోన్ ఇవ్వడంతో అతను చదువుకు దూరమవుతున్నాడని, అందుకే అతనిని చదువుకోమని చెప్పడంతో బాలుడు కోపంతో పోలీసులను ఆశ్రయించాడు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిని పిలిపించి ఏసిపి దుర్గా రావు విచారించి, బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. చివరకు బాలుడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు.
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

