Vijayawada: ‘అమ్మ చదువుకోమంటోంది..’ తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు
విజయవాడలోని ఒక బాలుడు తన తల్లిని చదువుకోమని బలవంతం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి, తన కుమారుడు చదువుకునేలా ప్రోత్సహించడంతో, బాలుడు కోపంతో ఈ పని చేశాడు. ఏసీపీ దుర్గా రావు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. చివరకు, బాలుడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు.
విజయవాడలోని సత్యనారాయణపురం గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఒక బాలుడు తన తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తల్లి తనను చదువుకోమని బలవంతం చేస్తుందని బాలుడు ఆరోపించాడు. తల్లి ఒంటరిగా ఇద్దరు కుమారులను పెంచుకుంటోంది. పెద్ద కుమారుడు పని చేసి చిన్న కుమారుడి చదువుకు ఖర్చులు భరిస్తున్నాడు. చిన్న కుమారుడికి తల్లి సెల్ ఫోన్ ఇవ్వడంతో అతను చదువుకు దూరమవుతున్నాడని, అందుకే అతనిని చదువుకోమని చెప్పడంతో బాలుడు కోపంతో పోలీసులను ఆశ్రయించాడు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిని పిలిపించి ఏసిపి దుర్గా రావు విచారించి, బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. చివరకు బాలుడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు.
శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా
తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో
కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి
తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!

