ఈనెల 4న భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్ 4న తొలి వాలిడేషన్ విమానం ఢిల్లీ నుండి ల్యాండ్ కానుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరు కానున్నారు. నిర్దేశిత గడువు జూన్ కన్నా ముందే విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను తీసుకురానుంది.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. రన్వే, ఏటీసీ సెంటర్లు సహా ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 4న ఢిల్లీ నుంచి తొలి వాలిడేషన్ ఎయిర్ ఇండియా విమానం భోగాపురం రన్వేపై ల్యాండ్ కానుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ఈ విమానంలో రానున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పడవ పందేల ట్రయల్ రన్ లో అపశృతి
Naa Anveshana: అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత
