Andhra Pradesh: రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ప్రతి బస్తాకు రూ.800..
యూరియా కోసం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయ్. ఏపీ, తెలంగాణల్లో యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. అయితే, యూరియా అధిక వినియోగంతో మానవాళి మనుగడకు ముప్పే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అవసరానికి మించి యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు.
యూరియా కోసం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయ్. ఏపీ, తెలంగాణల్లో యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. అయితే, యూరియా అధిక వినియోగంతో మానవాళి మనుగడకు ముప్పే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అవసరానికి మించి యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. దాంతో, యూరియా వాడకం తగ్గించడం.. ప్రత్యామ్నాయ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన మేరకు యూరియా వినియోగం తగ్గించడంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం.. అందులో భాగంగా, యూరియా వాడకం తగ్గించే రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూరియా వాడకం తగ్గిస్తే ప్రతి బస్తాకు 800 రూపాయల ప్రోత్సాహకం నేరుగా రైతుకే అందిస్తామని ప్రకటించారు. ఏడాదికి నాలుగు బస్తాల యూరియా వినియోగించే రైతు.. వచ్చే ఏడాది రెండు బస్తాలు మాత్రమే వాడితే.. బస్తాకు 800 చొప్పున 16వందల రూపాయల్ని రైతు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

