AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో 8 కీలక ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు

అమరావతిలో 8 కీలక ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు

Phani CH
|

Updated on: Oct 08, 2025 | 7:32 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 8 కీలక ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు ప్రత్యేక ప్రయోజన వాహనం (ఎస్పీవీ) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఎన్టీఆర్ స్టాట్యూ వంటి ప్రాజెక్టులు ఎస్పీవీ పరిధిలోకి వస్తాయి. ఇది రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ఎస్పీవీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. ప్రభుత్వం నేడు ఎస్పీవీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో ఎనిమిది ముఖ్యమైన ప్రాజెక్టుల అమలు కోసం ఈ ఎస్పీవీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల జాబితాలో అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఎన్టీఆర్ స్టాట్యూ, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కంపెనీ చట్టాలకు అనుగుణంగా ఈ ఎస్పీవీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్య బాబోయ్.. భారీ కొండ చిలువ..

నడిరోడ్డుపై రౌడీయిజం.. అదే రోడ్డుపై పోలీసుల ట్రీట్ మెంట్

హైవేపై కుప్పకూలిన హెలికాప్టర్‌.. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌

ఏ భాష మెసేజైనా మీ భాషలో చదువుకోవచ్చు.. వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌

కొడుకు అలిగాడని అప్పు చేసి బైక్‌ కొనిస్తే.. రెండు రోజులకే యాక్సిడెంట్‌లో మృతి