భావ ప్రకటన స్వేచ్ఛ శ్రీకాంత్ కు వరమా.. శాపమా..? వీడియో

Updated on: Oct 12, 2025 | 4:51 PM

నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, వివిధ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశద్రోహ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు వెల్లువెత్తాయి.

నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. “మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నా దేశానికి తండ్రి అయితే, నేను ఒక పౌరుడిని” అనే విధంగా ఆయన మాట్లాడిన తీరు దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది.ఈ వ్యాఖ్యల పట్ల 143 కోట్ల మంది భారతీయుల రక్తం మరగదా అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇంత నీచంగా మాట్లాడతాడా అని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాంత్ అయ్యంగార్‌పై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ ఎన్జీవోస్ అసోసియేషన్, సేవాలాల్ బంజారా సంఘం వంటివి పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో