Hyderabad: మోండా మార్కెట్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. కట్ చేస్తే.. చిమ్మచీకట్లో జరిగిందిదే

|

Jul 19, 2024 | 6:31 PM

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం చోరీ జరిగింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్‌లోని శ్రీని జ్యూవెలర్స్ వద్ద నుంచి మోండా మార్కెట్‌లోని ఎస్ఎస్ జ్యూవెలర్స్‌కు కిలో బంగారంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దినేష్ జైన్..

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం చోరీ జరిగింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్‌లోని శ్రీని జ్యూవెలర్స్ వద్ద నుంచి మోండా మార్కెట్‌లోని ఎస్ఎస్ జ్యూవెలర్స్‌కు కిలో బంగారంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దినేష్ జైన్ నుంచి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తలకు హెల్మెట్ ధరించి ముఖానికి మాస్క్ పెట్టుకుని ద్విచక్ర వాహనంపై వచ్చి బాటా సమీపంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద బంగారంతో ఉన్న బ్యాగును అపహరించారు. బ్యాగులో భారీగా బంగారు అభరణాలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే దినేష్ అతడి ఓనర్‌కి సమాచారం అందించడంతో మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బంగారం తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి ఘర్షణ జరగకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. బాధితుడు దినేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on