ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని సామాన్లు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే ప్రకంపనలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.