వరంగల్ జిల్లా రాయపర్తిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, భారీగా గంజాయి పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి వరంగల్కు చేరవేయబడిన ఈ గంజాయి స్మగ్లింగ్ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పుష్ప స్థాయి ఎత్తులు వేసినా, పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.