Viral Video: వార్నీ రీల్స్ పిచ్చి తగలేయా..! కాలు జారి 70మీటర్ల లోయల్లో పడ్డ మహిళ..

|

Oct 27, 2024 | 7:11 AM

సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరంగా రీల్స్‌ చేస్తున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా సంఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ కొండపై ప్రమాదకరంగా రీల్‌ చేస్తూ లోతైన లోయలోకి పడిపోయింది. ఆమె పరిస్థితి

Viral Video: వార్నీ రీల్స్ పిచ్చి తగలేయా..! కాలు జారి 70మీటర్ల లోయల్లో పడ్డ మహిళ..
Woman Making Reel Falls
Follow us on

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ అతి ముఖ్యమైన వస్తువుగా మారింది. ఇక విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చి ఇంటర్‌నెట్‌ సౌకర్యంతో ప్రజలు బాగా బిజీగా మారిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ఫీలు, రీళ్ల మోజులో పడికొట్టుకుంటున్నారు. ఈ పిచ్చి ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. రీల్స్‌ కోసం చాలా మంది తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరంగా రీల్స్‌ చేస్తున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా సంఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ కొండపై ప్రమాదకరంగా రీల్‌ చేస్తూ లోతైన లోయలోకి పడిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ మహిళ రీల్స్ చేస్తూ లోయలో పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక కుటుంబం శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించింది. అదే ఫ్యామిలీకి చెందిన 28 ఏళ్ల రేషు అక్కడి కొండపై రీల్ చేసింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి.. 70 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. గమనించిన కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఆ మహిళను పైకి తీసుకొచ్చారు.. అంబులెన్స్‌లో తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ప్రథమ చికిత్స అనంతరం బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..