
ఒక పక్షి కుందేలును.. అది కూడా సజీవంగా మింగడం మీరు ఎప్పుడైనా చూశారా? లేకపోతే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. కొన్ని సెకన్ల ఈ వీడియో క్లిప్లో, ఒక సముద్ర పక్షి సీగల్ ఒక కుందేలును సజీవంగా మింగడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ కళ్ళను నమ్మలేకపోతున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఒక సీగల్ కుందేలు నివసించే బొరియ దగ్గర నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. పక్షి మొదట కుందేలును దాని బొరియ నుంచి బయటకు లాగింది.. తరువాత దానిని సజీవంగా మింగేయడం మొదలు పెట్టింది. సీగల్ మొదట కుందేలు తలను తన ముక్కుతో పట్టుకుంది.. ఆ తర్వాత కొద్దిసేపటికే దానిని మింగడం మొదలు పెట్టింది.
సాధారణంగా ఈ సముద్ర పక్షి చేపలు, కీటకాలు, చిన్న పీతలు, నత్తలను తినడం సర్వసాధారణం. దీనితో పాటు ఇవి చిన్న పక్షులను , గుడ్లను కూడా తింటాయి. అయితే ఇప్పటి వరకూ బతికి ఉన్న కుందేలును మింగేసిన పక్షిని మాత్రం చూడలేదు. చాలా మంది నెటిజన్లు సీగల్ చాలా ఆకలితో ఉండవచ్చని.. అందుకే అది అంత పెద్ద ఎరను చాలా సింపుల్ గా తినేసింది అని అంటున్నారు.
ఈ వీడియోను @detailedexplanation అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. సీగల్స్ అవకాశవాద వేటగాళ్ళు అని యూజర్ అన్నారు. ఈ పక్షులు వాటి వాతావరణానికి అనుగుణంగా ఏ రకమైన ఆహారాన్ని అయినా తింటాయి. ఈ అనుకూలత కారణంగా అవి తీర ప్రాంతాల నుంచి నగరాల వరకు ఎక్కడైనా సులభంగా జీవించగలవు. అవి కుందేళ్ళను కూడా మింగేస్తాయని అంటున్నారు.
వీడియో ఇక్కడ చూడండి, పక్షి కుందేలును సజీవంగా మింగేసింది.
వీడియో చూసిన తర్వాత, ఒక యూజర్, “ఓ భాయిసాబ్! అది మొత్తం కుందేలును మింగేసింది” అని కామెంట్ చేశాడు. మరొక యూజర్, “ఇప్పుడు దీన్ని ఎలా జీర్ణించుకుంటుందో అని నేను ఆలోచిస్తున్నాను?” అని కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఇది చాలా భయానక దృశ్యం అని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..