రోడ్డుపై ఎద్దులు పోరాడుతున్న అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. చాలా వీడియోలలో ఎద్దులు మనుషులపై దాడి చేయడం కనిపించింది. ఎద్దుల పోరు వల్ల చాలాసార్లు కార్లు, బైక్లు దెబ్బతిన్న సంఘటనలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతోంది. అందులో రెండు ఎద్దులు రైల్వే ట్రాక్పై ఢీకొంటున్నాయి. వాటిని చూసిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. రైలు పట్టాలపై ఘర్షణపడుతున్న ఎద్దులను తరిమికొట్టే పనిలో పడ్డారు. రైల్వే మాన్ సహా స్థానికులు. వైరల్ వీడియో ఎక్కడిది అనేదానికి సంబంధించిన సమాచారం మాత్రం తెలియలేదు. కానీ, ఈ వీడియో భారతదేశానికి చెందినదిగా చెబుతున్నారు.
రైల్వే ట్రాక్పై నిలబడి కుమ్ముకుంటున్న ఎద్దులను తొలగించేందుకు లోకోపైలట్ ఎంతగా హారన్ కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పుడు గేటు వద్ద ఉన్న రైల్వే కార్మికుడు కర్రతో వచ్చి వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. అయినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో బక్కెట్లతో నీళ్లీ తీసుకొచ్చి కుమ్మరించారు. దాంతో ఆ రెండు ఎద్దులు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియో రికార్డ్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Dangerous sports at the level crossing – even the loco pilot and gateman had to just witness the sport! 😀😛😂 #IndianRailways #levelcrossing pic.twitter.com/OHKgPOKytv
— Ananth Rupanagudi (@Ananth_IRAS) July 5, 2024
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఇంత ప్రమాదకరమైన ఘటన జరుగుతుందని, గేట్మ్యాన్, లోకోపైలట్ చూస్తుండిపోవాల్సి వచ్చిందంటున్నారు. ఇప్పుడు ఎద్దుల వల్ల రైలు కాస్త ఆలస్యమైందని, లేకుంటే సమయానికి చేరుకునేదని మరొకరు రాశారు. ఇప్పుడు ఎద్దులు రోడ్డు వదిలి రైల్వే ట్రాక్పైకి వచ్చాయని, రైలు వేగం తక్కువగా ఉందని, లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని ఇంకొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..