AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు చివ‌రి బోగి వెనుక ఆంగ్ల అక్ష‌రం X ఎందుకు రాసి ఉంటుందంటే తెలుసా..? ఆసక్తికర అంశం ఏంటంటే..

ప్రతిరోజూ 24 మిలియన్లకు పైగా ప్రయాణికులు రైల్వేలను ఉపయోగిస్తున్నారు. రైలు ప్రయాణాలు, రైళ్ల గురించిన సమాచారం మనోహరంగా ఉంటాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ రైలు బండి ఎక్కిన అనుభవం ఉండి ఉంటుంది. రైలు ప్రయాణిస్తున్నప్పుడు దాని చివరి కంపార్ట్‌మెంట్‌లో పెద్ద అక్షరాలతో వ్రాసిన X అక్షరాన్ని మీరు చూసే ఉంటారు. దీనికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా..?

రైలు చివ‌రి బోగి వెనుక ఆంగ్ల అక్ష‌రం X ఎందుకు రాసి ఉంటుందంటే తెలుసా..? ఆసక్తికర అంశం ఏంటంటే..
X Symbol Behind The Train C
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2025 | 12:29 PM

Share

భారతీయ రైల్వే గణాంకాల ప్రకారం రోజుకు దాదాపు 22,593 రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లలో దాదాపు 13,452 ప్యాసింజర్ రైళ్లు (ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సబర్బన్ రైళ్లు). మిగిలినవి సరుకు రవాణా రైళ్లు. ప్రతిరోజూ 24 మిలియన్లకు పైగా ప్రయాణికులు రైల్వేలను ఉపయోగిస్తున్నారు. రైలు ప్రయాణాలు, రైళ్ల గురించిన సమాచారం మనోహరంగా ఉంటాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ రైలు బండి ఎక్కిన అనుభవం ఉండి ఉంటుంది. రైలు ప్రయాణిస్తున్నప్పుడు దాని చివరి కంపార్ట్‌మెంట్‌లో పెద్ద అక్షరాలతో వ్రాసిన X అక్షరాన్ని మీరు చూసే ఉంటారు. దీనికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా..?

రైల్వే స్టేషన్ దాటుతున్నప్పుడు రైల్వే అధికారులు రైలు చివరి కంపార్ట్‌మెంట్‌లో ఈ X గుర్తు ఉందో లేదో చెక్‌ చేస్తారు. ఈ కోడ్ ఉంటే మార్గమధ్యలో ఎటువంటి బోగీలు పడిపోకుండా మొత్తం రైలు సురక్షితంగా వచ్చేలా వారు నిర్ధారిస్తారు. ఒక రైల్వే ఉద్యోగి రైలు ప్రయాణిస్తున్నప్పుడు X గుర్తు లేని బోగీని చూసినట్లయితే ఆ రైలు అత్యవసర పరిస్థితిలో ఉందని, దాని చివరి బోగీ మార్గమధ్యలో ఎక్కడో పడిపోయిందని అతను వెంటనే అర్థం చేసుకుంటాడు.

దీని వలన వెనుక నుండి వచ్చే రైళ్ల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి అత్యవసర చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. దీంతో అధికారులు వెంటనే మిస్సైన బోగి కోసం చర్యలు ప్రారంభిస్తారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాగా ఇటీవల ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..