AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు.. మండిపడుతున్న భక్తులు..

ఈ ఘటన వివాదాస్పదమైంది. దీంతో బీజేపీ సహా రాజకీయ పార్టీలు విమర్శలకు దిగాయి. దేవాలయాల్లో దేవుడి కంటే ముఖ్యమంత్రి కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

Trending Video: వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు.. మండిపడుతున్న భక్తులు..
Temple Deity
Jyothi Gadda
|

Updated on: Dec 13, 2022 | 3:21 PM

Share

ఆలయ పూజారులు, సిబ్బంది అత్యుత్సాహం ముఖ్యమంత్రికే మచ్చను తెచ్చిపెట్టేలా చేసింది. ఆలయ సందర్శనకు వచ్చిన సీఎం భార్యను వర్షంలో తడవకుండా చూసేందుకు ఆలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవుడి విగ్రహానికి పట్టాల్సిన ముత్యాల గొడుగును తాపడం సీఎం భార్యకు పట్టారు. వర్షంలో దేవుడిని నల్లటి గొడుగు కిందే ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియా వేదికగా ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై సమీపంలో గల తిరువత్తిర్ త్యాగరాజ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా ఆలయాన్ని సందర్శించినప్పుడు వర్షం కురిసింది. అప్పుడు కొంతమంది సిబ్బంది దేవుడికి పట్టాల్సిన ముత్యాల గొడుగును సీఎం స్టాలిన్‌ భార్య దుర్గకు పట్టి గుడి బయటికి తీసుకెళ్లారు.

ఉత్సవాల్లో దేవుడి ఊరేగింపు జరుగుతుండగా, వానలో తడవకుండా దేవుడికి పట్టాల్సిన ముత్యాల గొడుగును ముఖ్యమంత్రి సతీమణి కోసం ఉపయోగించారు. బదులుగా దేవుడు తడవకుండా ఉండటానికి నల్ల గొడుగును వాడారు. ఈ వీడియోను రచయిత్రి షెఫాలీ వైద్య ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది. దీంతో బీజేపీ సహా రాజకీయ పార్టీలు విమర్శలకు దిగాయి. దేవాలయాల్లో దేవుడి కంటే ముఖ్యమంత్రి కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ముత్యాల గొడుగును ఉపయోగించిన ఘటనలో ముఖ్యమంత్రి భార్య పాత్ర లేదని ఆమె వెంట ఉన్న వారు వివరణ ఇచ్చారు. వర్షం కురుస్తుండటంతో కొంతమంది ముత్యాల గొడుగులతో వచ్చారు. ఇది గుడిలో కొంతమంది సిబ్బంది చేసిన పనిగా వారు వెల్లడించారు. అయితే, ఆ సమయంలో దుర్గ అడ్డుకోకపోవడమే ఇక్కడ పెద్దతప్పుగా వారు పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా ఈ ఘటనను బీజేపీ ఎంకే స్టాలిన్‌పై అస్త్రంగా మార్చుకుంది. స్టాలిన్‌ను విమర్శిస్తూ బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి ఓ వీడియోను ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే దీనిపై డీఎంకే ఇంకా స్పందించలేదు. డీఎంకే నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి