AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోళ్ల గూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..

ఇంటి పక్కనే ఉన్న కోళ్ల గూడును శుభ్రం చేస్తుండగా ఒక మూలన పెద్ద తేలు కనిపించింది. సరే అని పక్కకు జరపబోతే.. దాని వీపుపై ఏదో కదలిక.. నిశితంగా చూసిన గ్రామస్థులకు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచింది. ఎందుకంటే దేశంలోనే అత్యంత విషపూరితమైన ఒక ఎర్ర తేలు, తన వీపు నిండా పిల్లలను మోస్తూ అక్కడ దర్శనమిచ్చింది. పూణే జిల్లాలో జరిగిన ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకుందాం..

కోళ్ల గూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
Red Scorpion Spotted Carrying Babies On Its Back
Krishna S
|

Updated on: May 18, 2026 | 5:04 PM

Share

తేలు బలం దాని వీపుపైనే ఉంటుంది అనే సామెతను మనం వినే ఉంటాం. సరిగ్గా ఈ సామెతను నిజం చేసే ఒక అరుదైన దృశ్యం పూణే జిల్లాలోని మాలేగావ్ గ్రామంలో వెలుగుచూసింది. ఒక పెద్ద ఆడ ఎర్ర తేలు, తన వీపు నిండా వందలాది పిల్లలను మోస్తూ కనిపించడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. మాలేగావ్ గ్రామానికి చెందిన దౌలత్ కోలి అనే వ్యక్తి ఇంట్లో ఉల్లిపాయల ప్యాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న కోళ్ల గూడును శుభ్రం చేస్తుండగా, ఒక మూలలో ఒక పెద్ద తేలు కనిపించింది. మొదట అది మామూలు తేలు అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లి చూడగా, ఆ తేలు వీపుపై చిన్న చిన్న పిల్లలు గుంపుగా కదులుతూ కనిపించాయి. ప్రకృతిలో ఎంతో అరుదుగా కనిపించే ఈ మాతృత్వపు దృశ్యాన్ని గ్రామస్థులు వెంటనే తమ మొబైల్ కెమెరాల్లో రికార్డ్ చేశారు.

నిపుణులు ఏమంటున్నారంటే..?

ఈ ఫోటోలను చూసిన పాముల నిపుణుడు అనిల్ కన్సకర్‌కు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఇది సాధారణ తేలు కాదు. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన విషమున్న భారతీయ ఎర్ర తేలు. ఇవి ఎక్కువగా వేడిగా, తేమగా ఉండే చీకటి ప్రదేశాలలో, రాళ్ల కింద, కట్టెల కుప్పలలో దాక్కుంటాయి. తేళ్లు గుడ్లు పెట్టవు, నేరుగా పిల్లలకే జన్మనిస్తాయి. పిల్లలు పుట్టిన వెంటనే వాటన్నింటినీ తల్లి తేలు తన వీపుపై ఎక్కించుకుంటుంది. ఆ పిల్లలు కాస్త పెద్దవై, తమ మొదటి చర్మాన్ని విడిచేంత వరకు తల్లి వాటిని శత్రువుల నుండి కంటికి రెప్పలా కాపాడుతుంది.

చంపకుండా అడవిలో విడిచిపెట్టారు

సాధారణంగా ఇంట్లో తేలు కనిపిస్తే వెంటనే చంపేస్తారు. కానీ, ఈ గ్రామస్థులు అలా చేయకుండా వన్యప్రాణి సంరక్షణ సంఘం సభ్యులైన శ్రీకాంత్ ఖేడ్కర్, విశాల్ షిండేలకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చి ఆ తల్లి తేలును, పిల్లలను జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి పట్టుకున్నారు. అనంతరం వాటికి ఎలాంటి హాని జరగకుండా, సమీపంలోని కొండ ప్రాంత అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు.

పర్యావరణవేత్తల విజ్ఞప్తి

‘‘ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఇలాంటి విషపూరిత ప్రాణులు ఇళ్లలో కనిపించినప్పుడు భయంతో వాటిని చంపేయకండి. వెంటనే వన్యప్రాణి సంరక్షకులను సంప్రదించి, మూగజీవాలను కాపాడండి’’ అని మాలేగావ్ గ్రామస్థుల అవగాహనను అభినందిస్తూ పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు.

Follow Us