AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జాలీ రైడ్ వేయాలనిపించిందేమో.. కంటైనర్‌లో ఏకంగా 64 కి.మీ ప్రయాణం..

ఆ కాలేజ్‌లో మల్టీ స్పెషాలిటీ బ్లాక్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రి వేరే ప్రాంతం నుంచి కంటైనర్‌లో తెప్పించారు. ఆ సామాగ్రి అన్ లోడ్ చేస్తుండగా అనుకోని అతిథి కనిపించింది. దీంతో అందరూ పరుగులు తీశారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి ...

Viral: జాలీ రైడ్ వేయాలనిపించిందేమో.. కంటైనర్‌లో ఏకంగా 64 కి.మీ ప్రయాణం..
Python
Ram Naramaneni
|

Updated on: Sep 15, 2025 | 2:19 PM

Share

కేరళలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎర్నాకుళం నుండి కొట్టాయంకు కంటైనర్ లారీలో ఒక కొండచిలువ 64 కి.మీ ప్రయాణించి మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో భయాందోళనలు సృష్టించింది. శనివారం మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో మెడికల్ కాలేజీ మల్టీ-స్పెషాలిటీ బ్లాక్ కోసం నిర్మాణ సామగ్రిని తీసుకువచ్చిన కంటైనర్ లోపల కార్మికులు 10 అడుగుల పామును కనుగొన్నారు.

కంటైనర్‌లో కొండచిలువను గుర్తించిన సైట్ ఇంజనీర్ వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాడు. జిల్లా ఫెసిలిటేటర్ కె.ఎ. అబీష్ మరియు బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ జి. అఖిల్ సంఘటనా స్థలానికి చేరుకుని, కొండచిలువను పట్టుకుని ఆరోగ్య పరీక్ష కోసం అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు.

కొండచిలువ ఆరోగ్యంగా ఉందని, దానిని సురక్షితమైన ప్రదేశంలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు. ఎర్నాకుళంలో వస్తువులను లోడ్ చేస్తుండగా పాము కంటైనర్‌లోకి ప్రవేశించి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. కాగా ఇలా పాములు.. ఇతర ప్రాణులు కనిపిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి హాని కలిగించకుండా తమకు సమాచారం ఇవ్వాలని అటవీ సిబ్బంది సూచిస్తున్నారు. కొన్నిసార్లు అవి దారి తప్పి, ఆవాసాలు కోల్పోయి… ఆహారం కోసం.. జనసంచారం ఉండే ప్రదేశాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తమకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని రెస్క్యూ చేస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..