పెంపుడు పిల్లి కనబడుట లేదు..! ఆచూకీ చెప్పిన వారికి భారీగా నగదు బహుమతి.. వీధుల్లో పోస్టర్లు వైరల్‌..

|

Jan 08, 2024 | 1:42 PM

అజయ్, అతని కుటుంబానికి పిల్లులంటే చాలా ఇష్టం.చికు హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ చికు ఆచూకీ కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి సమాచారం అందకపోవడంతో పిల్లిని కనిపెట్టిన వ్యక్తికి భారీ నగదు బహుమతి కూడా ప్రకటించారు.

పెంపుడు పిల్లి కనబడుట లేదు..! ఆచూకీ చెప్పిన వారికి భారీగా నగదు బహుమతి.. వీధుల్లో పోస్టర్లు వైరల్‌..
Chiku Is Lost..
Follow us on

చాలా మందికి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి. కొందరు కుక్కల్ని పెంచుకుంటారు. మరికొందరు కుండేళ్లు, కోళ్లు, పిల్లుల్ని కూడా పెంచుకుంటారు. ఇకపోతే వాటిని తమ ఇంట్లోని కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటారు.. వాటి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఘటనే నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలో తన పిల్లిని కనిపెట్టిన వ్యక్తికి రూ .1 లక్ష రివార్డ్ ఇస్తామని ప్రకటించాడు ఓ పెంపుడు పిల్లి యజమాని.

నోయిడాలోని సెక్టార్ 62 నుంచి 14 రోజుల క్రితం ఓ పిల్లి తప్పిపోయింది. అతని పిల్లి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు యజమాని. తప్పి పోయిన పిల్లి ఫోటోతో పాటుగా పూర్తి సమాచారంతో ఊరంతా పోస్టర్లు వేసి దాని కింద రూ.లక్ష రివార్డు రాశాడు. అందిన సమాచారం ప్రకారం అజయ్ కుమార్ పిల్లి కనిపించలేదు.

అజయ్ ఫ్యామిలీ నోయిడాలోని సెక్టార్ 62లోని హార్మొనీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వారి పిల్లి 14 రోజుల క్రితం పోయింది. ఆ పిల్లి పేరు చికు. అజయ్ స్నేహితుడు అతనికి ఈ పెర్షియన్ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అజయ్, అతని కుటుంబానికి పిల్లులంటే చాలా ఇష్టం.చికు హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ చికు ఆచూకీ కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి సమాచారం అందకపోవడంతో పిల్లిని కనిపెట్టిన వ్యక్తికి లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..