ఆ విషయంలో ప్రధాని మోదీ గ్రేట్.. అమెరికా నిపుణుడి ప్రశంస

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రధాని మోదీ ఎంతగానో ప్రయత్నించారు. ఈ విషయంలో ఆయన చొరవ తీసుకున్నంతగా ప్రపంచంలో ఎవరూ చేయలేదని అమెరికా విదేశాంగ నిపుణుడు ప్రశంసించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని విరమించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసినన్ని ప్రయత్నాలు, మరే ఇతర పాశ్చాత్యేతర దేశ నేత కూడా చేయలేదని మైఖేల్ కుగెల్‌మన్ కొనియాడారు. 

ఆ విషయంలో ప్రధాని మోదీ గ్రేట్.. అమెరికా నిపుణుడి ప్రశంస
No Non Western Leader Tried More Than Modi Says Us Expert Kugelman

Updated on: Sep 19, 2026 | 2:46 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రధాని మోదీ చేసినంతగా పశ్చిమేతర దేశాల నేతలెవరూ కృషి చేయలేదని అమెరికా విదేశాంగ నిపుణుడు మైఖేల్ కుగెల్‌మన్ ప్రశంసించారు. అయితే, అమెరికా తాజాగా తీసుకువచ్చిన ఆంక్షల బిల్లు భారత్, అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

అమెరికా ఆంక్షల వేళ కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించేలా అమెరికా ప్రతినిధుల సభ సరికొత్త ఆంక్షల బిల్లును ఆమోదించింది. ఈ తరుణంలో కుగెల్‌మన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోయినా, శాంతి స్థాపన కోసం ఆయన చూపిన తెగువ, చొరవ అసాధారణమైనవని మైఖేల్ కుగెల్‌మన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు. అదే సమయంలో, వాషింగ్టన్ ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా ఆంక్షల చట్టం భారత్-అమెరికా మైత్రికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఇరు దేశాల సంబంధాల్లో పెద్ద సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషించారు.

 

భారత్‌-అమెరికా సంబంధాలకు ఎదురుదెబ్బ

ఈ తాజా రష్యా ఆంక్షల బిల్లు భారత్-అమెరికా సంబంధాలలో అత్యంత పెద్ద ఎదురుదెబ్బగా మారుతుందని కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి చైనా కూడా భారీగా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, అమెరికా మాత్రం చైనా కంటే భారత్‌పైనే ఎక్కువ సుంకాల భారాన్ని మోపే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనాకు ఉన్న బలమైన పట్టు కారణంగా అమెరికా ఆ దేశం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందనీ, కానీ భారత్ వాణిజ్యం విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించే ప్రమాదం ఉందని విశ్లేషించారు.

అమెరికా ప్రతినిధుల సభలో తాజాగా ఈ బిల్లు 262-159 ఓట్ల తేడాతో గెలిచింది. అంతకుముందే సెనేట్ ఆమోదం కూడా పొందిన ఈ బిల్లు, ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం పెండింగ్‌లో ఉంది. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించేలా రష్యాను బలవంతంగా చర్చలకు ఒప్పించడమే ఈ సరికొత్త చట్టం ప్రధాన ఉద్దేశమని అమెరికా చట్టసభ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.  అధ్యక్షుడు ట్రంప్ గనుక ఈ బిల్లుపై సంతకం పెడితే, ఇది తక్షణమే పూర్తిస్థాయి చట్టంగా మారుతుంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us