పండ్లలో రారాజు మామిడి.. ఈ రకం పండు తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..! కిలో ఎంతంటే..

మామిడి పండు దాని ప్రకాశవంతమైన రూబీ-ఎరుపు రంగు, మృదువైన ఆకృతి, చాలా తీపిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పండ్లు జపాన్‌కు చెందినవి.కానీ ఇటీవల భారతదేశంలో, ముఖ్యంగా కాశ్మీర్, బీహార్‌లలో కూడా పండిస్తున్నారు. మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి. కిలోగ్రాముకు రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ప్రతి పండును జాగ్రత్తగా పెంచుతారు. అందువల్ల, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక హోదాకి చిహ్నంగా మారింది.

పండ్లలో రారాజు మామిడి.. ఈ రకం పండు తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..! కిలో ఎంతంటే..
Miyazaki Mango

Updated on: May 03, 2025 | 7:14 PM

పండ్లలో రారాజు మామిడి అంటారు. మామిడి పండ్లు బహుశా ఇష్టపడని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దాదాపు అందరికీ ఇష్టమైన పండ్లు మామిడి. మామిడి సీజన్‌ వేసవి కాలం కోసం కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఊంటారు. ఆమ్ పన్నా నుండి ఆమ్రాస్ వరకు మామిడి సీజన్‌లో దేశవ్యాప్తంగా మామిడి పండ్లతో తయారు చేసే విభిన్న రకాల వంటకాలు ఉన్నాయి. భారతదేశం వెయ్యికి పైగా రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేసే దేశం కాబట్టి, భారతదేశం మామిడి పండ్లకు నిలయంగా పిలుస్తారు. కానీ, ఈ అరుదైన ప్రత్యేకమైన రకాల్లో కొన్ని భారీ ధర పలుకుతుంటాయి. అది ఎంతంటే.. కిలో మామిడి పండ్లు ధర లక్షల్లో ఉంటుంది.

సాధారణంగా ఒక కిలో మామిడి పండ్ల ధర డిమాండ్‌ను బట్టి రూ.100 నుంచి 200 మధ్య ఉంటుంది. కానీ ఒక జాతిరకం మామిడి పండ్ల ధర కిలో రూ.3 లక్షల వరకు ఉంటుందంటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే. కిలో మామిడి పండ్ల ధర రూ.3 లక్షల వరకు మార్కెట్‌లో పలుకుతుంది.

మియాజాకి మామిడి పండు దాని ప్రకాశవంతమైన రూబీ-ఎరుపు రంగు, మృదువైన ఆకృతి, చాలా తీపిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పండ్లు జపాన్‌కు చెందినవి.కానీ ఇటీవల భారతదేశంలో, ముఖ్యంగా కాశ్మీర్, బీహార్‌లలో కూడా పండిస్తున్నారు. మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి. కిలోగ్రాముకు రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ప్రతి పండును జాగ్రత్తగా పెంచుతారు. అందువల్ల, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక హోదాకి చిహ్నంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..