
దేశంలో ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటిపోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి మహారాష్ట్రలోని మాలెగావ్కు చెందిన ఒక యువకుడు అదిరిపోయే దేశీ జుగాడ్ (చిట్కా) కనిపెట్టాడు. కేవలం రూ. 1500 నుండి రూ. 1600 ఖర్చుతో తన స్కూటర్ను నడిచే ఏసీగా మార్చేశాడు. దీనికోసం అతడు స్కూటర్పై చిన్న నీటి బాటిల్, మోటార్ పంప్, పైప్, నాజిల్ సెట్ను అమర్చాడు. స్కూటర్ స్టార్ట్ అవ్వగానే ఈ నాజిల్స్ ద్వారా చిన్న నీటి బిందువులు శరీరానికి తగిలి, గాలితో కలిసి ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వినూత్న సాంకేతికతను ఎవాపొరేటివ్ కూలింగ్ అని పిలుస్తున్నారు. సదరు వ్యక్తి తన స్కూటర్పై ఒక చిన్న నీటి బాటిల్, చిన్న మోటార్ పంప్, వైరింగ్, ప్రత్యేకమైన నాజిల్ సెటప్ను అమర్చాడు. స్కూటర్ స్టార్ట్ చేయగానే ఈ చిన్న పంప్ సహాయంతో నాజిల్స్ ద్వారా చాలా సన్నని నీటి చుక్కలు (మిస్ట్) బయటకు వస్తాయి. బైక్ వేగంగా వెళ్తున్నప్పుడు, ఆ చల్లని నీటి బిందువులు గాలితో కలిసి ప్రయాణికుడి శరీరానికి తగలడం వల్ల ఏసీ గదిలో ఉన్నంత చల్లని అనుభూతి కలుగుతుంది.
ఈ పూర్తి సెటప్ను తయారు చేయడానికి కేవలం 1500 నుండి 1600 రూపాయలు మాత్రమే ఖర్చయింది. ఇన్స్టాగ్రామ్లో @foodiehindustani24 అనే ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజమైన టాలెంట్ మన దేశంలోని ఇలాంటి సామాన్యుల దగ్గరే ఉంది, దీనికి వెంటనే పేటెంట్ తీసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ జుగాడ్ చూడటానికి ఎంతో అద్భుతంగా, ఉపశమనంగా ఉన్నప్పటికీ, దీని భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైక్ వైరింగ్లో చిన్న లోపం జరిగినా వాహనం పాడయ్యే ప్రమాదం ఉందని, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు నీటి బిందువులు కళ్లల్లో పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ప్రాణాంతకమైన ఎండల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయడం విశేషం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..