AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beggar Lakhs : గుండెపోటుతో సాదువు మృతి..అతని గది తలుపులు తెరిచిన స్థానికులకు దిమ్మతిరిగిపోయే సీన్‌! సంచులకొద్దీ..

భిక్షాటన చేసుకుని జీవించే ఓ సాధువు గుండెపోటుతో మరణించాడు. వీధివీధిలో భిక్షాటన చేసుకుంటూ జీవించే సాధువు హఠాన్మరణంతో స్థానికులు అతని గది తలుపులు తెరిచి చూశారు. అక్కడ కనిపించిన సీన్‌ చూసి అంతా షాక్‌ అయ్యారు.

Beggar Lakhs : గుండెపోటుతో సాదువు మృతి..అతని గది తలుపులు తెరిచిన స్థానికులకు దిమ్మతిరిగిపోయే సీన్‌! సంచులకొద్దీ..
Beggar Lakhs
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2022 | 9:08 AM

Share

భిక్షాటన చేసుకుని జీవించే ఓ సాధువు గుండెపోటుతో మరణించాడు. వీధివీధిలో భిక్షాటన చేసుకుంటూ జీవించే సాధువు హఠాన్మరణంతో స్థానికులు అతని గది తలుపులు తెరిచి చూశారు. అక్కడ కనిపించిన సీన్‌ చూసి అంతా షాక్‌ అయ్యారు. ప్రతిరోజు భిక్షాటన చేసుకునే యాచకుడి ఇంట్లో కనిపించిన దృశ్యం అక్కడివారందరినీ విస్తూ పోయేలా చేసింది. దాంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం సాధువు ఇంట్లో కనిపించిన సంచులు చూసి అవాక్కయ్యారు..సంచుల కొద్దీ కనిపించిన నోట్ల కట్టలు చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాకినాడ రూరల్‌ జిల్లాలోని కరప మండలం వేళంగిలో రామకృష్ణ అనే సాధువు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ, రక్ష రేకులు కడుతూ జీవించేవాడు. స్థానిక చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉండేవాడు. సమీపంలోని సత్రంలో రోజూ భోజనం చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. ఈ క్రమంలోనే సదరు యాచకుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాధువు రామకృష్ణ గదిలోకి వెళ్లారు. లోపల రెండు సంచులు నిండుగా కనిపించాయి. వాటిని తెరిచిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వాటినిండా కరెన్సీ నోట్లున్న పాలిథిన్ కవర్లు కనిపించాయి. వాటిలో ఎక్కువగా పది రూపాయల నోట్లు ఉన్నట్టు ఎస్సై డి.రమేశ్ బాబు తెలిపారు. ఆ సొమ్ము మొత్తం దాదాపు రూ. 2 లక్షల పైనే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడడం, చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో డబ్బు సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు. పంచాయతీ కార్మికుల సాయంతో రామకృష్ణ మృతదేహాన్ని ఖననం చేసినట్టు చెప్పారు పోలీసులు.