AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్‌ను కలిపే రైలు..12 రాష్ట్రాల మీదుగా 70 గంటల సూపర్ జర్నీ!

భారతీయ రైల్వేలు ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద జాతీయ రైల్వే వ్యవస్థ. దేశంలో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అంతేకాకుండా దేశంలో సుదూర ప్రయాణాలకు రైళ్లపై ఆధారపడపడుతుంటారు. ఇతర మార్గాలతో పోల్చుకుంటే.. రైళ్లలో తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయవచ్చు. అయితే, 12 రాష్ట్రాలను కలిపే ఒక ప్రత్యేకమైన రైలు ఉందని మీకు తెలుసా? దేశంలోని ఉత్తర అంచున ఉన్న జమ్మూ-కశ్మీర్‌ను, దక్షిణ అంచున ఉన్న తమిళనాడును కలిపే ఈ రైలు ప్రయాణీకులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ఆ రైలు ప్రత్యేకతేలంటో ఇక్కడ చూద్దాం..

Indian Railways: కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్‌ను కలిపే రైలు..12 రాష్ట్రాల మీదుగా 70 గంటల సూపర్ జర్నీ!
Himsagar Express
Jyothi Gadda
|

Updated on: May 04, 2026 | 8:36 AM

Share

భారతీయ రైల్వేలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రైళ్లలో హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ (Himsagar Express) ప్రత్యేకమైనది. ఇది ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే కీలక వారధి. దేశంలోని ఉత్తర అంచున ఉన్న జమ్మూ-కశ్మీర్‌(Jammu Kashmir )ను, దక్షిణ అంచున ఉన్న తమిళనాడు(Tamil Nadu)ను కలిపే ఈ రైలు ప్రయాణీకులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది. సుమారు 3,790 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమిస్తూ, ఈ రైలు 12 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. దాదాపు 70 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో 69 ప్రధాన స్టేషన్లలో ఆగుతూ దేశంలోని భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రయాణికులకు పరిచయం చేస్తుంది. 12 రాష్ట్రాలను తాకుతూ సాగే ఈ అద్భుత ప్రయాణం ప్రతి ఒక్కరూ అనుభవించదగ్గది.

12 రాష్ట్రాల గుండా సుదీర్ఘ ప్రయాణం:

హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇది తన ప్రయాణంలో ఏకంగా 12 రాష్ట్రాలను దాటుతుంది. జమ్మూ-కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా ఈ రైలు వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఇది సుమారు 3,790 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.

ప్రయాణ సమయం, సౌకర్యాలు:

ఈ సుదీర్ఘ దూరాన్ని చేరుకోవడానికి ఈ రైలుకు సుమారు 3 రోజులు (దాదాపు 70 గంటలకు పైగా) సమయం పడుతుంది. తన మార్గంలో సుమారు 69 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతూ వేలాది మంది ప్రయాణికులకు నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది. దక్షిణ రైల్వే (Southern Railway) ఈ రైలు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇందులో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ రైలులో 20 కోచ్‌లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సాంస్కృతిక వారధి:

హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ కేవలం దూరాన్ని మాత్రమే తగ్గించడం లేదు, ఉత్తర, దక్షిణ భారతాన్ని సాంస్కృతికంగా కూడా కలుపుతోంది. మంచుతో నిండిన హిమాలయాల అంచు నుండి మొదలై, హిందూ మహాసముద్రం చెంతన ముగిసే ఈ ప్రయాణం భారతదేశ వైవిధ్యతను కళ్లకు కడుతుంది. రైలు ప్రయాణాలను ఇష్టపడే వారికి, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రకృతి అందాలను, సంస్కృతులను చూడాలనుకునే వారికి హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ ఒక అద్భుతమైన ఎంపిక. మీరు కూడా ఎప్పుడైనా దేశాన్ని ఒక చివర నుండి మరొక చివరకు రైలులో చూడాలనుకుంటే, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us