తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో

| Edited By:

Jul 02, 2020 | 9:21 AM

అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు.

తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో
Follow us on

అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరి మనసును కదిలిస్తోంది.

కాగా జమ్ముకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో మూడేళ్ల బాలుడితో కలిసి ఓ వ్యక్తి ఆ దారిలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో ఆ వ్యక్తికి రెండు తూటాలు తగిలి.. అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆ బాలుడు అక్కడే కూర్చొని రోదించాడు. ఆ ఘటనను చూసిన భద్రతా దళాలు వెంటనే ఆ బాలుడిని రక్షించి, అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అతడిని ఊరడించేందుకు ఓ అధికారి చాక్లెట్ ఇస్తానని చెప్పినా.. ఆ బాలుడు పట్టించుకోలేదు. తన తాత గురించే చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అధికారుల కళ్లు చెమ్మగిల్లాయి. ఆ తరువాత ఆ బాలుడిని అతడి తల్లికి అప్పగించారు. కాగా ఈ బాలుడికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వాటిపై సామాన్యులు మొదలు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.