
సాధారణంగా రాజకీయ నాయకులకి సెంటిమెంట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కో దేవుడిని ఇష్ట దైవంగా కొలుస్తారు. అలాగే ఓ నాయకుడు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో అయినప్పటి నుంచి ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో కొలిచాడు… వరుసుగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో… 2023 నుంచి ప్రతి ఏడాది ఆంజనేయస్వామి రథోత్సవానికి హెలికాప్టర్ తో పూలు చల్లి తన భక్తిని చాటుకుంటున్నాడు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డెపాల్యం శ్రీ వీరాంజనేయస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఆంధ్ర కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెల్లెకేరే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రఘుమూర్తి వరుసగా మూడుసార్లు గెలిచాడని… శ్రీ వీరాంజనేయ స్వామి మీద ఉన్న భక్తితో… 2023 నుంచి హెలికాప్టర్ నిండా పూలు పెట్టుకొని రథోత్సవం రోజు వడ్డెపాల్యం గ్రామంపై చక్కెర్లు కొడుతూ రథోత్సవంలో పూలు చల్లి వెళ్లిపోయేవారు. అలాగే ఈ ఏడాది కూడా రథోత్సవం రోజు హెలికాప్టర్ లో వచ్చి పూలు చల్లి తన భక్తిని చాటుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
గడిచిన రెండుసార్లు చిత్రదుర్గం నుంచి హెలికాప్టర్లో వచ్చి రథోత్సవం రోజు పూలు చలి వెళ్లే ఎమ్మెల్యే రఘుమూర్తి… ఈ ఏడాది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ద్వారా హెలిపాడ్ ఏర్పాటు కోసం పోలీసుల అనుమతి తీసుకుని.. రథోత్సవంలో హెలికాప్టర్ తో పూలు చల్లారు… వరుసగా మూడవ ఏడాది కూడా హెలికాప్టర్లో వచ్చి రథోత్సవానికి పూలు చల్లడంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..