AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల చూడగా..

వరి పొలం కోసేటప్పుడు అనూహ్యంగా ఒక పిట్టగూడులో విచిత్రమైన రంగులో ఉన్న నాలుగు గుడ్లు లభించాయి. రైతు నర్సయ్య వాటిని భద్రపరిచి, సబ్‌స్క్రైబర్‌లకు చూపించాడు. ఈ గుడ్లు ఏ పక్షివో మీరు గుర్తిస్తే కామెంట్ చేయండి.. ఈ తరహా పక్షి గుడ్లు చూడటం మాత్రం చాలా అరుదు..

వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల చూడగా..
Bird Eggs
Ram Naramaneni
|

Updated on: May 16, 2026 | 9:06 AM

Share

వరి పొలంలో పని చేస్తున్న రైతులకు ఓ అందమైన ప్రకృతి దృశ్యం కనిపించింది. వరి ఆకులను చాకచక్యంగా మడిచి, వాటిని కుట్టినట్టుగా గూడు నిర్మించిన ఓ చిన్న పక్షి అందరినీ ఆకట్టుకుంది. ఆ గూడులో ఆకుపచ్చ-నీలం రంగులో, గోధుమ మచ్చలతో ఉన్న చిన్న గుడ్లు కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పక్షి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది టైలర్‌బర్డ్ (Tailorbird) లేదా ప్రినియా (Prinia) జాతికి చెందిన చిన్న పక్షి గూడు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పక్షులు సాధారణంగా గడ్డి పొదలు, వరి పొలాలు, తక్కువ ఎత్తులో ఉన్న మొక్కల మధ్య గూళ్లు నిర్మిస్తుంటాయి. ముఖ్యంగా ఆకులను కుట్టినట్టుగా మడిచి లోపల మృదువైన పదార్థాలతో గూడు తయారు చేయడం వీటి ప్రత్యేకత. గూడులో కనిపించిన గుడ్ల రంగు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. లేత నీలం-ఆకుపచ్చ రంగులో ఉండే ఈ గుడ్లపై గోధుమ రంగు మచ్చలు ఉండటం చూడగానే ప్రకృతి కళాఖండంలా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ గూడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పక్షులను, వాటి గూళ్లను ఎవరూ తాకకుండా సంరక్షించాలని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. ఇలాంటి గూళ్లు కనిపించినప్పుడు గుడ్లను చేతితో తాకకుండా ఉంటే మంచిది. పక్షి దగ్గరలోనే ఉండే అవకాశం ఉంది. మనిషి వాసన వస్తే అది గూడు వద్దకు తిరిగి రాకపోవచ్చు. రైతు పొలాల్లో కూడా ఇలాంటి జీవ వైవిధ్యం ఉండటం పర్యావరణ సమతౌల్యానికి మంచి సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

Follow Us