AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dantewada: బావి నుంచి నీరుకి బదులు పెట్రోల్.. బకెట్లతో బారులు తీరిన ప్రజలు.. రీజన్ ఏమిటంటే

రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలోని ఓ బావిలోంచి అకస్మాత్తుగా పెట్రోలు బయటకు రావడం ప్రారంభించినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఈ బావిలో నుంచి బకెట్ల ద్వారా పెట్రోల్‌ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు బావిలో నుంచి పెట్రోలు రావడానికి గల కారణాన్ని పోలీసులు గుర్తించారు.

Dantewada: బావి నుంచి నీరుకి బదులు పెట్రోల్.. బకెట్లతో బారులు తీరిన ప్రజలు.. రీజన్ ఏమిటంటే
Petrol Came Out From Well
Surya Kala
|

Updated on: Nov 15, 2024 | 1:02 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గత రెండు రోజులుగా ఓ సంఘటన కారణంలో వార్తల్లో నిలుస్తుంది. అక్కడ ఓ ఇంట్లో ఉన్న బావిలో నుంచి నీళ్లకు బదులు పెట్రోల్ వస్తోంది. ప్రజలకు ఈ విషయం తెలిసింది. దీంతో బావి నుంచి పెట్రోలు తీసుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు బావి దగ్గరకు చేరుకోవడం ప్రారంభించారు. ఆనోటా ఈ నోటా ఈ విషయం పోలీసులకు చేరింది. వెంటనే బావి దగ్గరకు చేరుకొని ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. తదనంతరం బావి నుంచి ఎలా పెట్రోల్ వస్తుంది అనే విషయంపై విచారణ చేపట్టారు. ఆపై విచారణలో వెలుగుచూసిన విషయం పోలీసులను విస్మయానికి గురిచేసింది.

ఈ ఘటన గీడం ప్రాంతానికి సంబంధించినది. భోలు జైన్ కుటుంబం ఓ ఇంట్లో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం అంటే బుధవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు నీటి కోసం ప్రాంగణంలోని బావిలో బకెట్ వేశారు. బావి నుంచి బకెట్ బయటకు తీయగానే అతనికి నీరు వింతగా కనిపించింది. నీరు రంగు కూడా భిన్నంగా ఉందని గుర్తించిన ఆ వ్యక్తీ ఇంధనం లాగా ఉందని భావించాడు. కొంత సేపు పరిశీలించిన తర్వాత తెలిసింది బకెట్ లో ఉంది నీరు కాదు పెట్రోల్ అని. కొద్దిసేపటికే ఆ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

బావిలోంచి పెట్రోలు బయటకు వస్తోంది… ఇది విన్న జనం భారీ సంఖ్యలో తమ ఇళ్ల నుంచి బకెట్లతో బావి వద్దరావడం ప్రారంభించారు. పెట్రోలు కోసం ఆ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఇంటి దగ్గర పెద్ద క్యూలు మొదలయ్యాయి. అవును పెట్రోల్ ఉచితంగా దొరుకుతుంది అంటే ఎవరికీ ఆశ పుట్టదు చెప్పండి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇంటికి చేరుకున్నారు. ఈ విషయంపై విచారణ జరిపేందుకు వీలుగా వారు ఇంటిని, ప్రాంతాన్ని సీలు చేశారు.

పెట్రోల్ చోరీ కేసు

ఆ తర్వాత ఓ కేసుపై పోలీసుల దృష్టి పడింది. కొద్దిరోజుల క్రితం పెట్రోల్‌ పంప్‌ యజమాని ఈ కేసుని రిజిస్టర్‌ చేశారు. పాత బస్టాండ్‌లోని బఫ్నా పెట్రోల్ పంపు యజమాని తన స్థలంలో ప్రతిరోజూ పెట్రోల్ దొంగిలిస్తున్నారని చెప్పారు. పోలీసులు ఈ కేసును ఆ కేసుతో ముడిపెట్టి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఎవరైనా అగంతకులు పెట్రోల్‌ను దొంగిలించి ఈ బావిలో పోస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే పోలీసుల ఈ అనుమానం తప్పని తేలింది.

అసలు కారణం ఏమిటంటే

అనంతరం మరో కోణంలో విచారణ కొనసాగించారు. మర్నాడు అంటే గురువారం పోలీసులు బావిలోని నీరు పెట్రోల్ గా మారడానికి గల కారణాన్ని గుర్తించారు. ఈ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఒక పెట్రోల్ పంపు ట్యాంక్ ఉంది. అక్కడున్న పెట్రోల్‌ పంపు ట్యాంక్‌ లీక్‌ అయింది. దీంతో ఆ పెట్రోల్ భూమిలోకి ఇంకిపోయి ఈ బావికి చేరింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగ్నిమాపక దళం, పోలీసులను ఇంటి చుట్టూ మోహరించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాదు పెట్రోల్ పంప్ ట్యాంక్ మరమ్మతు పనులు కూడా చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us