Viral: నోట్లో అన్నం పెడితే చాలు.. బుడ్డోడికి వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా..

రాఖీ పండుగ వేళ.. అన్ని కుటుంబాల్లో అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటుంటే.. ఆ కుటుంబం మాత్రం తీవ్ర ఆందోళనలో ఉంది. కారణం ఏడాది వయస్సున్న వారి ముద్దుల తనయుడికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆహారం నోట్లో పెడితే చాలు.. చిన్నోడు వాంతులు చేసుకుంటున్నాడు.

Viral: నోట్లో అన్నం పెడితే చాలు.. బుడ్డోడికి వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా..
Child

Updated on: Aug 09, 2025 | 5:10 PM

మధ్యప్రదేశ్‌ ఖాండ్వాలో ఏడాది వయస్సు ఉన్న బాలుడికి ఉన్నపలంగా వాంతులు స్టార్టయ్యాయి. అన్నం జీర్ణం అవ్వలేదేమో అని సిరప్ వేశారు. అయినా సరే వాంతులు ఆగకపోగా.. ఇంకాస్త ఎక్కువయ్యాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ చిన్నోడికి టెస్టులు చేసిన డాక్టర్లు బుడ్డోడి గొంతులో ఏదో చిన్నపాటి వస్తువు ఉండటాన్ని గుర్తించారు. ఆ తర్వాత పరిశీలించగా అది రాఖీకి అమర్చిన LED లైట్‌ అని తేలింది. రాఖీకి అమర్చిన LED లైట్‌ను బాలుడు అనుకోకుండా మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో నిరంతరం వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో.. వారికి తొలుత వాంతులు ఎందుకు అవుతున్నాయో అర్థం కాలేదు. మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు త్వరగా చర్య తీసుకుని అతని గొంతు నుంచి LED బల్బ్‌ను తొలగించారు. చిన్నోడు కోలుకున్నాడని.. డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

ఆ చిన్నారికి చికిత్స చేసిన రెసిడెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ.. ఎక్స్-రేలో గొంతులో ఏదో ఉన్నట్లు నిర్ధారించామని చెప్పారు. లేపరోస్కోపిక్ పద్దతిలో దాన్ని తొలగించినట్లు వివరించారు. ఆ బాలుడి తండ్రి మనీష్ పటేల్ మాట్లాడుతూ.. రాఖీలో LED అమర్చారని చెప్పారు. తాము అతనికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారీ.. బాబు వాంతులు చేసుకున్నట్లు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు గొంతు నుంచి లైట్ తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యాక, బాలుడిని కొన్ని రోజులు పరిశీలనలో ఉంచారు. ఇప్పుడు అతను డిశ్చార్జ్ అయ్యాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..