Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ వేడుకల్లో విషాదం.. వేగంగా వెళ్తున్న ఆటోపై రంగుల బెలూన్లు విసిరిన పిల్లలు.. ఏం జరిగిందంటే..

దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వివిధ రంగుల్లో స్నానం చేశారు. హోలీ సందర్భంగా దేశం మొత్తం రంగులమయంగా మారింది. కానీ, ఈ అందమైన రంగుల హోలీ వేడుక వెనుక కొన్ని విషాదాలు కూడా జరిగాయని తెలుస్తోంది. అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హోలీ వేడుకల్లో విషాదం.. వేగంగా వెళ్తున్న ఆటోపై రంగుల బెలూన్లు విసిరిన పిల్లలు.. ఏం జరిగిందంటే..
Autorickshaw
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 16, 2025 | 11:35 AM

వైరల్‌ వీడియోలో హోలీ సందర్భంగా కొంతమంది పిల్లలు వీధిలో వెళుతున్న వారిపై నీటితో నిండిన బెలూన్లను విసిరారు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న రిక్షాపై వారు కొన్ని బెలూన్లను విసిరారు. ఈ బెలూన్లలో ఒకటి ఆటో డ్రైవర్ ముఖంపై పడింది. దాంతో ఏకంగా మొత్తం రిక్షానే బోల్తా పడింది. ఈ సంఘటన మొత్తం వీధిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఇప్పుడు ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగిందని తెలిసింది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలిసింది. పిల్లలు విసిరిన బెలూన్ల వల్ల ఆటో బ్యాలెన్స్ తప్పి అక్కడికక్కడే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రిక్షా బోల్తా పడగానే బెలూన్లు విసురుతున్న యువకులు పారిపోయారు. ఈ సంఘటన జరిగింది రెండేళ్ల క్రితం అయినప్పటికీ,.. హోలీ సందర్భంగా అది మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు బెలూన్లు ఊదుతున్న పిల్లలను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన రౌడీ యువతకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని భావించారు. కానీ ఈ సంవత్సరం కూడా, కొంతమంది మరోసారి ఇలాంటి అల్లరి పనులనే చేస్తూ కనిపించారు.. వాళ్ళు వచ్చే పోయే వాళ్ళని రంగులు వేస్తూ వేధించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి.

వివిధ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వీడియో పాతదే అయినప్పటికీ, ఇది ఇప్పటికీ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు ఈ పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..