AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 42 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దాడి.. ఆస్పత్రికి తరలించే లోపే మృతి, వీడియో చూస్తే షాక్!

ఇటీవల కాలంలో మనుషులపై జంతువులు దాడి చేయడం సర్వసాధారణమవుతున్నాయి. మాములుగా పులి, చిరుత, సింహం లాంటివి దాడి చేయడం కామన్. కానీ ఆవు, ఎద్దులు కూడా దాడి చేయడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఓ ఎద్దు పదే పదే దాడి చేయడంతో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Balu Jajala
|

Updated on: Feb 26, 2024 | 4:02 PM

Share

ఇటీవల కాలంలో మనుషులపై జంతువులు దాడి చేయడం సర్వసాధారణమవుతున్నాయి. మాములుగా పులి, చిరుత, సింహం లాంటివి దాడి చేయడం కామన్. కానీ ఆవు, ఎద్దులు కూడా దాడి చేయడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఓ ఎద్దు పదే పదే దాడి చేయడంతో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ ఢిల్లీలోని ఓ పాఠశాలలో పెద్ద కుమారుడిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన ఓ వ్యక్తి ఎద్దు దాడిలో మృతి చెందాడు. గత వారం ఢిల్లీలోని కల్కాజీ ఎక్స్టెన్షన్లోని సెయింట్ జార్జ్ స్కూల్ వెలుపల సుభాష్ కుమార్ ఝాపై ఎద్దు దాడి చేసింది. 42 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు వెనుక నుంచి దాడి చేసి, ఆపై ముఖం, ఛాతీపై పదేపదే దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాయం కోసం కొడుకు కేకలు వేయడంతో ఆ వ్యక్తిని దారితప్పిన ఎద్దు తన్నడం, ఆ వ్యక్తిని కాపాడేందుకు వచ్చిన కొందరు ప్రయాణికులు బాత్రా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి పక్కటెముకలకు పలు పగుళ్లు, తలకు గాయాలయ్యాయని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. బీహార్ కు చెందిన సుభాష్ కుమార్ ఢిల్లీలో లోన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి జంతువుల దాడులు జరిగాయని, అనేక మంది గాయపడ్డారని కొందరు స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో నడుస్తున్న అక్రమ డెయిరీలే పశువుల సమస్యకు కారణమని వారు పేర్కొన్నారు.